సహకార విద్యుత్ సరఫరా సంగం సిరిసిల్లను జాతీయ గ్రామీణ విద్యుత్ కో ఆపరేటివ్ అసోసియేషన్ (ఎన్ఆర్ ఇసీఏ) ప్రతిపాదనలతో పైలట్ ప్రాజెక్టుగా అప్పటి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని వెనుకబడ్డ సిరిసిల్ల తాలూకా యందు గ్రామీణ విద్యుదీకరణను త్వరితగతిన చేపట్టుటకు రురల్ ఎలక్ట్రీషియన్ కార్పొరేటీషన్ న్యూఢిల్లీ వారి ఆర్థిక సహాయంతో స్థాపించడం జరిగింది.
సహకార విద్యుత్ సరఫరా సంగం లిమిటెడ్ (సేన్) నవంబర్ 1, 1970లో కార్యకలాపాలు ప్రారంభించిన సంస్థకి 1974, జులై స్వంత భవనానికి ఆనాటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి చేతుల మీదగా ప్రారంగోసతవం జరిగిది. 1970 లో 46 గ్రామాలతో సేవలందిచడం ప్రారంభించిన ఈ సహకార సంగం ప్రసుతం రాజన్న సిరిసిల్ల జిల్లాలో 230 గ్రామాలకు తన సేవలందిస్తుంది. చేనేత కార్మికులకీకాక, గృహ, వ్యాపార, పారిశామిక, వ్వవసాయ మరియు వీధిదీపాములకు కూడా ఈ సంస్థ నుడి విద్యుత్ సరఫరా చేయబడుతుంది.
ఈ సంస్థను ప్రారభించుటకు ముఖ్యఉదేశం, సిరిసిల్ల మెట్ట ప్రాంతంలోని ఆహార ఉత్పతులను పెంచి ప్రజల జీవన ప్రమాణాన్ని ముగుగుపరచటం 1970-71 ప్రారంభంలో 2299 వ్వవసాయ సర్వీసులు మరియు 2421 ఇతర తరగతిల సర్వుసులు ఉంటే ఇప్పుడు 66,811 వ్వవసాయ సర్వుసులు మరియు 1,62,656 ఇతర తరగతల సర్వీసులు వెరసి మొత్తం 2,29,467 విద్యుత్ సర్వీసులకు ఈ సహకార సంగం విద్యుత్ సరఫరా చేస్తున్నది. నీటి వసతులు సరిగ్గా లేక కరెంటు కనెక్షన్ ద్వారానే సేద్యం చేసే రైతన్నాలకి ఈ సహకార సంగం చేదోడుగా నిలుస్తుది. సిరిసిల్లతో పాటు ఇలాటి సహకార సంగంలు భారతదేశంలో మరో నాలుగు 1. హుకేరి (కర్ణాటక), 2. కోడినూరు (గుజరాత్), 3. లక్నో (ఉత్తర్ప్రదేశ్) మరియు 4. మూల ప్రవరా (మహారాష్ట్ర) నుండి ప్రాంభించినారు. తడనఁతరం ఆంధ్రప్రదేశ్ లోని చీపురుపల్లి, అనకాపల్లి, కుప్పం, లయందు కూడ ఇట్టి సహకార విద్యుత్ సరఫరా సంగంలు ప్రారంబించడం జరిగిది. మన జిల్లాలో సహకార విద్యుత్ సరఫరా సంగం లిమిటెడ్ (సెన్) స్థాపించిన నాటి నుండి కార్యకలాపాల విజయవంతంగా సాగటానికి, ఈ సంస్థ యొక్క సిబంది మరియు పాలకవర్గం కృషి ఎంతన ఉంది. పెదబడుగు వర్గాలకి సేవలందిస్తున్న ఈ సంగం దిన విజయంతంగా ముందుకు నడిపిస్తున్న సిబంది మరియు పాలకవర్గం ఎప్పటికీ అబినందనీయులు